మహాట్భంధన్ కూటమి ఏర్పాటుతో బీజేపీకి చెక్ చెప్పొచ్చు: సీఎం నితీష్ కుమార్
ప్రస్తుతం భారత్ బలమైన నాయకుడిగా ప్రధాని నరేంద్రమోదీ ఎదిగారు. ఆయన హవా ఇంకా పెరుగుతోంది. అంతేతప్ప తగ్గడం లేదు. దీంతో ప్రత్యర్ధి పార్టీలు ఆయన్ను అదుపు చేసేందుకు ఇచ్చే ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన ఉద్దేశ్యాన్ని వివరించారు. బీజేపీని నిలువరించాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలతో జాతీయ స్థాయిలో మహా ఘట్బంధన్ కూటమిని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇలాగే గతంలో బీహార్ లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ జతకట్టాయని చెప్పారు. అందువల్లే బీజేపీని నిలువరించగలిగామని అన్నారు.మహాఘట్భంధన్ ను ఏర్పాటు చేస్తేనే బీజేపీకి చెక్ పెట్టగలమని అన్నారు.యూపీలో ఇలాంటి కూటమి ఏర్పాటు చేయకపోవడం వల్లే ఎస్పీ పరాజయం పాలైందని అన్నారు. దీనికోసం కాంగ్రెస్, వామపక్షాలు సిద్ధం కావాలని సూచించారు.తాను కూడా లెఫ్ట్ పార్టీల నేతలతో మాట్లాడుతానని అన్నారు. ఇక ప్రధాని పదవికి మాత్రం అర్హత కలిగిన నేతలను ఎంచుకోవాలని సూచించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.