శంషాబాద్ ఏరియాలో సెంటు భూమి కూడా లేదు: ఎంపీ కె.కేశవరావు
శంషాబాద్ ఏరియాలో తనకు సెంటు భూమి కూడా లేదని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు తేల్చి చెప్పారు. దండుమైలారం గ్రామంలో మాత్రం భూములు కొనుగోలు చేసిన మాట నిజమేనని మరోసారి స్పష్టం చేశారు. శంషాబాద్ ప్రాంతంలో తనతో పాటు తన కుమార్తె ఫోటో పెట్టి కొందరు మీడియాలో వార్తలు రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవన్నీ వట్టి పుకార్లేనని అన్నారు. అలాంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అన్నారు.
కావాలనే కొందరు తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దండుమైలారంలో భూముల కొనుగోలు ఒప్పదం 2013లో జరిగిందని తెలిపారు. ఆ సమయంలో తాను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నానని అన్నారు. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా తాను భూములు కొనుగోలు చేశానని చెప్పారు. తాను అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతనే దండుమైలారంలో భూములు కొనుగోలు చేశామన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.