చంద్రబాబు దావోస్ రేంజ్ లో ఇంటిని కట్టకున్నారు: భూమన కరుణాకర్ రెడ్డి
అమరావతిలో అది నిర్మిస్తాం.. ఇది నిర్మిస్తాం అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకుంటున్నారని వైసీసీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తన ఇంటిని మాత్రం దావోస్ , సింగపూర్ స్థాయిలో నిర్మించుకున్నారని ఆరోపించారు. ఏపీ ఉద్యోగులను అందరిని అమరావతికి తరలించారని అన్నారు. కాని చంద్రబాబు మాత్రం తన ఇంటిని హైదరాబాద్ లో కట్టుకున్నారని అన్నారు. అంతేకాకుండా ఇంటి నిర్మాణం కోసం వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. నిర్మాణంలో విదేశీ వస్తువులను వాడారని అన్నారు. అడుగుకు ఏకంగా 40 వేల చొప్పున ఖర్చు చేసి మార్బుల్స్ వాడారని అన్నారు.
వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ ఇంటికి నిత్యం వందలాది మంది జనం వస్తూంటారని అన్నారు. కాని ఏపీ సీఎం ఇంటిని మాత్రం ఎవరూ చూడలేదని అన్నారు. జగన్ విషయంలో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అందువల్ల తాము చంద్రబాబు ఇంటి గురించి మాట్లాడుతున్నామని అన్నారు. జగన్ పై చేసిన తప్పుడు ప్రచారాలను టీడీపీ నిరూపించగలదా అంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.