రాజన్ ను వదులుకోవడం భారత్ దురదృష్టం: నోబెల్ విజేత రిచర్డ్ థాలెర్
రీసెంట్ గా ప్రొఫెసర్ రిచర్డ్ థాలెర్ నోబెల్ ఆర్థిక బహుమతిని గెలుచుకున్నారు. తనతో పోటీపడి కొద్దిలో నోబెల్ ను చేజార్చుకున్న రఘురాం రాజన్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. “రఘురామ్ రాజన్ తిరిగి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. నాకెంతో ఆనందంగా ఉంది. ఆయన్ను వదులుకోవడం భారత్ దురదృష్టం అని నా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నోబెల్ ప్రైజ్ అతనికి రాలేదేమో. రేపు భవిష్యత్తు మాత్రం అతనిదే” అని అన్నారు.
ప్రస్తుతం థాలెర్, రాజన్ చికాగో యూనివర్శిటీలో భాగంగా ఉన్న బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సహాధ్యాయులుగా ఉన్నారు. ఈ స్కూల్ నుంచే మూడేళ్ల పాటు సెలవు తీసుకున్న రాజన్ ఇండియాకు వచ్చి ఆర్బీఐ గవర్నర్ గా విధులు చేపట్టారు. ఆయన మూడేళ్ల పదవీ కాలం పూర్తయైన విషయం తెలిసిందే. అయితే రాజన్ పదవీ కాలాన్ని పొడిగించేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో రాజన్ రాజీనామా చేసి తిరిగి చికాగో వెళ్లిపోయారు. ఇక రాజన్ లేకపోవడంతో ఇండియాకు వచ్చే నష్టం తమ వర్శిటీకి లాభమని రిచర్డ్ థాలెర్ అన్నారు. ఈ మధ్యకాలంలో నోబెల్ ప్రాబబుల్స్ పేర్లు బయటకు వెల్లడిఅయినప్పుడు రఘురామ్ రాజన్ పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.