నోట్ల రద్దు వెనుక ఉన్న ఆర్ధిక వేత్తలకు నోబెల్ బహుమతి ఇవ్వాలి: పి చిదంబరం
రద్దయిన పాత నోట్లలో 1% తిరిగి రాలేదని ఆర్బీఐ ప్రకటించింది. దీనిపై మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మనీని వైట మనీగా చేయడానికే నోట్ల రద్దు చేశారని ఆరోపించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆర్ధికవేత్తలకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ ట్విట్టర్ లో వ్యగ్యంగా వ్యాఖ్యానించారు. రద్దు వల్ల ప్రభుత్వానికి వచ్చింది 16 వేల కోట్లు అని అన్నారు. అయితే కొత్త నోట్ల ముద్రణతో ఆర్బీఐ 21 వేల కోట్ల మేర నష్టపోయిందన్నారు. దీనికి ఆ బ్యాంకు సిగ్గుపడాలని అన్నారు
మరో కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జెవాలా కూడా ట్విట్టర్ లో స్పందించారు. నోట్ల రద్దు అనేది పెద్ద విపత్తు అని అన్నారు.ఈ గేమ్ లో అవినీతిపరులు రూ.కోట్లు ఆర్జించారి అన్నారు. అయితే ఏ పాపం తెలియని 104 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నోట్ల రద్దు అనే నిర్ణయం ఆర్బీఐ ప్రతిష్ఠను దెబ్బతీసిందన్నారు. అలాగే ఇండియా విశ్వసనీయత కూడా దెబ్బతిందని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.