భారీ వరదలు కారణంగా ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం
భారీ వరదలు కారణంగా ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వరదలు వల్ల వేలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విరిగి పడిన కొండ చరియల కింద కొందరు చిక్కుకున్నారని అధికారులు చెబుతున్నారు. వీరిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ సహాయ కార్యక్రమాలు చేపట్టింది.
అలాగే అసోంలో వరదల కారణంగా 30 వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. 52 గ్రామాల నుంచి 25 వేల మంది ప్రజలు వరదల వల్ల నిరాశ్రయులయ్యారు. నదులు ప్రమాద స్థాయిని మించి పొంగిప్రవహిస్తున్నాయి. ప్రజలు అలెర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.