రామ మందిరంకు ముస్లీంలు వ్యతిరేకం కాదు: ముస్లీం మత గురువు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగీ మహలి
యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రామ మందిర నిర్మాణం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక వీహెచ్ పీ ఈ అంశంలో ఆందోళనలు చేపడుతుందని ప్రచారం సాగుతోంది. ఇక రామ మందిర నిర్మాణం విషయంలో పిటిషనర్లు, బాధ్యులు కోర్టు బయటే చర్చించుకుని పరిష్కారానికి రావాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో రామ మందిర నిర్మాణం విషయంపై ముస్లీం మతపెద్ద మౌలానా ఖలీద్ స్పందించారు.
సుప్రీం కోర్టు సూచనను ప్రఖ్యాత ముస్లిం మత గురువు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగీ మహలి స్వాగతించారు. కోర్టు బయట సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన సూచనను తాము గౌరవిస్తామన్నారు. భారతీయ ముస్లింలు రామ మందిర నిర్మాణానికి ఏ మాత్రం వ్యతిరేకంగా లేరని అన్నారు. ఇది అత్యంత సున్నితమైన విషయం అని అన్నారు. దీనిపై ఇంతకు ముందు కూడా చర్చలు చేశామని అన్నారు. అయితే రాజకీపార్టీలు కలుగజేసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. తమ మత పెద్దలతో చర్చించిన అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఫైనల్ డెసీషన్ ని సుప్రీంకోర్టు మాత్రమే ఇవ్వాలని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.