ఓ పత్రిక తనపై తప్పుడు వార్తలు రాస్తోంది.. వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు..
ఏపీ సీఎం చంద్రబాబుకి అనుకూలంగా వార్తలు రాస్తున్నారని ఓ వార్తా పత్రికపై వైసీపీ నేత ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు నోటీసులు జారీ చేయకముందే ఓ పత్రికలో, ఛానెల్లో నోటీసులు జారీ అయిపోయినట్లుగా వార్తలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల సమయంలో తాను చేసిన వ్యాఖ్యలను బట్టి అత్యుత్సాహం ప్రదర్శించారని అన్నారు. తనపై తప్పుడు వార్తలు రాసేశారని తెలిపారు. ఆ పత్రిక ఎప్పుడూ తన మీద విషం చిమ్ముతోందని మండిపడ్డారు.
వాస్తవానికి స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకి నిన్నటి విషయం గురించి తెలియక ముందే తనకు ప్రివిలేజ్ కమిటీ నుంచి నోటీసులు ఇచ్చేశారని వార్తలు రాశారని తెలిపారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో ఆ పేపర్ పేరు చంద్రజ్యోతి పేపర్ అని అన్నారని చెప్పారు. అలాగే ఆ ఛానెల్ పేరును చంద్రజ్యోతి ఛానెల్ అని చెప్పారని అన్నారు. నిజంగా అలా ఎందుకు చెప్పారో తనకు అప్పుడు అర్ధం కాలేదని .. కాని ఇప్పుడు అర్థమవుతోందని అన్నారు. కోడెల శివప్రసాద్ రావు స్పీకర్ పదవిలో ఉండి టీడీపీకి సంబంధించిన అంశాలు హైలైట్ చేస్తున్నారని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.