లక్ష్మారెడ్డిపై వేటు తప్పదా?
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమపథకాలు ప్రారంభిస్తూ దేశ – విదేశాలను ఆకర్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన అంశం కావడంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో – అటు విపక్షాల నుంచి ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఎంసెట్ లీకేజీ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు ప్రధాన హస్తంగా తీసుకొని ప్రభుత్వంపై దాడులు ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో పకడ్బందీగా ఎంసెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాల్సి ఉన్నా అందుకు మంత్రులు – అధికారులు పట్టించుకోకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై డీజీపీ – సీబీసీఐడి అధికారుల నివేదికలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ ఎంసెట్ లీకేజీ మచ్చనుంచి బయట పడేందుకు తనదైన శైలిలో కీలక చర్యలకు ఉపక్రమించబోతున్నారని అంటున్నారు.
ఎంసెట్-3ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఓ పక్క చర్యలు తీసుకుంటున్నారు. లీకేజీకి సంబంధించి వైద్య – ఆరోగ్యశాఖ మంత్రి చెర్లకోల లక్ష్మారెడ్డిని – డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని భర్తరప్ చేయాలంటూ కాంగ్రెస్ – టీడీపీతోపాటు సీసీఐ – సీపీఎం సహా అన్ని పక్షాలతో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాల నోరు మూయించేందుకు వైద్య – ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలుకనున్నారా?అంటే అధికారపార్టీ నుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నది. గత ఏడాది కాలంగా మంత్రి లక్ష్మారెడ్డి వ్యవహారంపై ముఖ్యమంత్రి నివేదికలు సేకరించారని సమాచారం.
అయితే సమయం కోసం వేచిచూస్తున్న ముఖ్యమంత్రి ఇదే అదునుగా భావించి లక్ష్మారెడ్డిని మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలకడం ఖాయమని టీఆర్ ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. లక్ష్మారెడ్డి స్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మినబంటు అయిన తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గ విస్తరణ చేస్తారన్న ప్రచారం వచ్చినప్పుడల్లా నిరంజన్ రెడ్డికి మంచి శాఖ అప్పగిస్తారన్న ప్రచారం సైతం జోరుగా సాగిన విషయం తెలిసిందే!. విద్యాశాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాఖ మార్పు చేసి ఆయనకు ఎస్సీ సంక్షేమశాఖ అప్పగించనున్నట్లు పార్టీలో ప్రచారం కొనసాగుతున్నది. ఓ దశలో కడియం శ్రీహరిని సైతం కేబినెట్ నుంచి తొలగిస్తారన్న వార్తలు వచ్చినా ఆయన సామాజిక వర్గానికి చెందినవారు పార్టీలో లేక పోవడంతో ఆయన శాఖను మార్పు చేయాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.