పద్మం వికసించిన వేళ
పద్మాఅవార్డుల ప్రదానోత్సవం మంగళవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా నిర్వహించారు. పలురంగాల్లో ప్రతిభను చూపిన ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ పద్మ పురస్కారాలను అందజేశారు. పద్మ పురస్కారాల ప్రదానోత్సవానికి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, వెంకయ్యనాయుడు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు.
పద్మ విభూషణ్ అందుకున్నవారు
రజనీకాంత్, రామోజీరావు, వాసుదేవ్ కల్కుంటే ఆత్రే, గిరిజాదేవి, శాంతా విశ్వనాథన్లు పద్మవిభూషన్ అవార్డులు అందుకున్నారు. వీరికి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ పురస్కారాలను అందజేశారు. అంతకు ముందు పద్మభూషన్, పద్మశ్రీ అవార్డులను అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మభూషణ్ అవార్డులు కళా రంగం నుంచి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాగా, క్రీడా రంగం నుంచి సానియా మీర్జా అందుకున్నారు. కాగా అవార్డులు అందుకున్న ప్రముఖులు అందరూ కూడా ఆయా రంగాల వాళ్లకి, ఆయా రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలుతెలిపారు. వాళ్ల ప్రోత్సావం వల్లే తాము ఈ స్థాయికి చేరామని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.