స్వంత దేశానికి వెళ్లడానికి భయపడుతున్న పాక్ గూఢచారి సాజిద్ మునీర్..
భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కు పాక్ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. గూఢచర్యం చేస్తున్నారంటే ఆరోపించి శిక్షను విధించింది. దీంతో ప్రపంచయావత్తు తీవ్ర దిగ్భాంత్రికి గురైంది. అయితే పాక్ కు చెందిన గూఢచారి సాజిద్ మునీర్ జైలు శిక్ష పూర్తి చేసుకుని విడుదలయ్యాడు. అతనికి భారత్ ఏడాదిపాటు తినడానికి ఇచ్చి ఓ నివాసాన్ని కూడా ఇచ్చింది. అతను ఈ కేసులో ఏకంగా 12 ఏళ్ళపాటు భోపాల్ జైలులో శిక్షను అనుభవించాడు. అతన్ని రిలీజ్ చేసిన తర్వాత భారత్ పాక్ కు ఈ విషయాన్ని తెలియజేసింది.
అయితే తమ దేశ గూఢచారి విడుదల విషయంలో అవతలి వైపు నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో అతని బాధ్యతను భోపాల్ పోలీసులు తీసుకున్నారు. గత పది నెలలుగా అతనికి ఆహారం అందిస్తున్నారు. అయితే సాజిద్ మాత్రం తిరిగి పాక్ కు వెళ్ళేందుకు భయపడుతున్నాడని సమాచారం. తాను పాక్ వెళితే చంపేస్తారని అంటున్నాడు. తనకు భారత న్యాయవ్యవస్థపై చాలా నమ్మకం ఉందని అంటున్నాడు. ఈ విషయాన్ని అతను చెప్పినట్లుగా ఎస్పీ రాజేశ్ భడోరియా అన్నారు. అతను ఆర్మీ రెజిమెంట్ నుంచి సీక్రెట్ పేపర్లు సేకరిస్తుండగా పట్టుకున్నారు. అతన్ని మే 2004లో భోపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని శిక్షా కాలం గత ఏడాది జూన్ 4తో ముగిసింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.