కుక్కతోక వంకర తీరు మార్చుకోని పాకిస్థాన్
గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న భారత్ పాక్ సరిహద్దుల్లో మళ్లీ బాంబుల మోత మోగింది. దీంతో సరిహద్దు గ్రామాల్లో అలజడి చెలరేగింది. పాకిస్థాన్ సైన్యం బుద్ధి మారలేదు. కుక్కుతోక వంకర మాదిరిగా మళ్లీ కవ్వింపులకు పాల్పడింది.పూంచ్ సెక్టార్ లో ఆ దేశ ఆర్మీ సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడింది.
సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని మోర్టార్ షెల్స్ ప్రయోగించింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉన్న నాలుగు గ్రామాలపై 82 ఎంఎం మోర్టార్ షెల్స్ ప్రయోగించింది. మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.ఏకంగా 24 గంటల వ్యవధిలో నాలుగుసార్లు కాల్పులకు తెగబడింది.అయితే పాక్ కాల్పులను భారత బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.