పనామా పేపర్స్ వ్యవహారంలో పాక్ ప్రధానికి షాక్..
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి చుక్కెదురైంది. ఆయనకు పాక్ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పనామా పేపర్స్ వ్యవహారంలో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ నిమిత్తం జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఈ టీమ్ ముందు తక్షణం నవాజ్ షరీఫ్ హాజరుకావాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ కేసు విచారణకు టైమ్ లిమిట్ కూడా పెట్టింది.
వచ్చే 60 రోజుల్లో కేసు విచారణ పూర్తి కావాలని ఆదేశించింది. దీంతో మరో రెండునెలల్లో నవాజ్ షరీఫ్ భవిష్యత్తు ఏంటనేది తేలిపోనుంది. ఇక ప్రస్తుత పరిణామాలను ఆ దేశ ఆర్మీ ఉపయోగించుకునే పనిలో ఉంది. మెల్లగా పాలనపై పట్టుబిగించేందుకు ప్రయత్నాలు చేస్తునట్లుగా ప్రచారం సాగుతోంది.మరోవైపు పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ఖాన్.. నవాజ్ షరీఫ్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తక్షణం షరీఫ్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఎప్పటినుంచో షరీఫ్ పై ఈ వ్యవహారంలో విమర్శలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ విజయం సాధించినట్లు అయింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.