పాక్ తోక వంకర..! మరోసారి రుజువైంది..!
పాక్ తోక వంకర.. అన్న విషయం చాలాసార్లు రుజువైంది. పంద్రాగస్టు వేడుకల వేళ మరోమారు పాక్ తన వంకర బుద్ధిని బయటపెట్టుకుంది. ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆ దేశ వ్యాప్తంగా ప్రజలు
వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే సరిహద్దులోని పాక్ సైన్యం కూడా వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా పాక్ సైన్యం వాఘా బోర్డర్ లో ఉన్న భారత సైన్యానికి మిఠాయిలు పంచింది. దీంతో భారత సైన్యం.. పాక్ సైన్యానికి శుభాకాంక్షలు చెప్పింది.
మరోవైపు..పాక్ సైన్యం ఎల్ ఓసీ దగ్గర పూంఛ్ సెక్టార్ లో కాల్పులకు తెగబడింది. భారత సైనిక పోస్టులపైకి యధేచ్ఛగా కాల్పులు జరిపింది. ఇటీవలి కాలంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం ఇదే మొదటిసారి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.