పన్నీర్ సెల్వం మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు: మాజీ మంత్రి పాండ్యరాజన్
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి పాండ్యరాజన్ అన్నారు. అన్నాడీఎంకే పురచ్ఛి తలైవి అమ్మ వర్గం నేత పన్నీర్ సెల్వం నేతృత్వంలో అందరూ ఏకం అవుతారని చెప్పారు. అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలు పన్నీరు సెల్వం వల్ల మళ్లీ ఏకమవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. తమిళనాడులో డెంగీ జ్వరతీవ్రతను నియంత్రించడంలో సర్కారు విఫలమైందని చెప్పారు.దీంతో ఆగస్టు 10న నిరసనకు పిలుపునిచ్చారు.
అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని ఆందోళనలు చేపట్టేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నామన్నారు. ఎయిర్ పోర్ట్ కి పన్నీర్ వస్తున్న సమయంలో అక్కడ నిన్న ఓ వ్యక్తి కత్తితో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పరంజ్యోతి, మరికొందరు నేతలు ఆయనకు భద్రతగా నిలిచారని చెప్పారు. కత్తితో పట్టుబడిన వ్యక్తిని అన్నాడీఎంకేకు చెందిన కార్యకర్తగా గుర్తించామన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.