మాజీ సీఎం పన్నీరు సెల్వం పార్టీ పేరు ఇదే..?
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయన అమ్మాడీఎంకే పేరుతో త్వరలో కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని ముమ్మర చర్చలు సాగుతున్నాయి. ఆయనతోపాటు 11 మందిపై స్పీకర్ అనర్హత వేటు వేయనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆయన వేరే పార్టీలో చేరే అవకాశం లేదని తెలుస్తోంది. అందుకే కొత్త పార్టీ పెట్టనున్నట్లు సమాచారం. శనివారం జరిగిన బలపరీక్షలో 11 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. దీంతో పన్నీర్తో సహా 11మందిని స్పీకర్ బహిష్కరించనున్నారని టాక్. అంతేకాకుండా వచ్చే ఆరునెలల్లోగా ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దీంతో ఆరునెలల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే పన్నీర్ సెల్వంకు పార్టీ పెట్టడమే మార్గం అని ఆయన భావిస్తున్నారట. అంతేకాకుండా ఉమ్మడి గుర్తుతో పోటీ చేయడంపై ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అన్నాడీఎంకే స్థానంలో అమ్మాడీఎంకే పార్టీ పెట్టాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈసీతో మాట్లాడుతున్నట్లుగా సమాచారం. ఇలా తానే జయ లలితకు నిజమైన వారసుడిని అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసమే అమ్మ పేరుతో పార్టీ పెట్టనున్నారని సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.