వెంకీ-పవన్ మరో మల్టీ స్టారర్..?
ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలంటే బాలీవుడ్ కి పెట్టింది పేరు. టాలీవుడ్ హీరోలు మాత్రం వాటి జోలికి వెళ్లడానికే జడిసేవారు. అయితే రాను రాను మన హీరోల ఆలోచన మారుతూ వచ్చింది. ప్రస్తుతం కథ నచ్చితే చాలు ఎవరితో సినిమా
చేయడానికైనా రెడీ అంటున్నారు. ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నది విక్టరీ వెంకటేష్ అని చెప్పొచ్చు.
ఆయన ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కల్యాణ్ తో కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. మరోసారి పవన్ తో కలిసి వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. నవంబరులో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. ఇందులో వెంకటేష్ కూడా నటించబోతున్నారని ప్రచారం సాగుతోంది.
వెంకటేష్ – త్రివిక్రమ్లది సూపర్ కాంబినేషన్. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ త్రివిక్రమ్ రచించిన కథలే కావడం విశేషం. త్రివిక్రమ్ పంచ్లు వెంకీ, పవన్ పలికితే అభిమానులకు ఆ కిక్కే వేరుగా ఉంటుంది. దీంతో త్రివిక్రమ్ కాంబినేషన్ లో అభిమానులను అలరించడానికి వెంకీ, పవన్ రెడీ అవుతున్నారన్నమాట.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.