దినకరన్ భార్యను విచారించిన పోలీసులు..?
ఢిల్లీ పోలీసులు దినకరన్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ గుర్తు రెండాకుల కోసం లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా ఈసీకే లంచం ఇవ్వాలని ప్రయత్నించారని విమర్శలు వస్తున్నాయి. ఆయనను తదుపరి విచారణ కోసం చెన్నై తీసుకొచ్చారు. ప్రస్తుతం దినకరన్ ను చెన్నైలోని ఓ ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఉంచారు. అలాగే ఆయన్ను విచారిస్తున్నారు. ఇక దినకరన్ భార్యను కూడా పోలీసులు విచారించినట్లుగా తెలుస్తోంది. ఆమె జయ టీవీ బాధ్యతలను చూస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.