నా ఇంటికి పోలీసులను పంపారు : సీఎం కేజ్రీవాల్
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఆప్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్పై ఆప్ ఎమ్మెల్యేలు దాడిచేసినట్లు ఆరోపణల రావడంతో కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరైస్టైన ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలకు ఢిల్లీ న్యాయస్థానం రిమాండ్ కూడా విధించింది. ప్రధాన కార్యదర్శిపై దాడికి సంబంధించిన ఆధారాల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు.
చీఫ్ సెక్రటరీపై తమ పార్టీ సభ్యులు దాడిచేసినట్టు ఆరోపిస్తోన్న కేసులో మంత్రి మండలి ప్రతిపాదించిన తీర్మానాన్ని సమర్పించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అనుమతి కూడా కోరామని ట్వీట్ చేశారు. సీబీఐ జడ్జ్ బీహెచ్ లోయ మృతి కేసులోనూ దర్యాప్తు సంస్థలు ఇలాంటి ఉత్సాహం చూపితే బాగుంటుందని విమర్శించారు. నా నివాసానికి పోలీసులు బాగానే పంపించారు.. ఇది చాలా మంచిపని.. జస్టిస్ లోయా మృతిపై కూడా అమిత్ షాను ఎప్పుడు ప్రశ్నిస్తారు అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.