‘సాహోరే బాహుబలి’..
టాలీవుడ్ జక్కన్న తెరెక్కించిన బాహుబలి పార్ట్ వన్ ఓ రేంజ్ లో హిట్ అయింది. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. పాత రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ సెకెండ్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం బాహుబలి ది కంక్లూజన్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.
రాజమౌళి ట్విట్టర్ ద్వారా పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా ‘సాహోరే బాహుబలి.. మహాశివరాత్రి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. హీరో ప్రభాస్ ఏనుగు తొండంపై నిలబడి ఉన్న స్టిల్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది.
వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు సాధించిన ‘బాహుబలి’ చిత్రానికి సెకెండ్ పార్ట్ గా ‘బాహుబలి 2’ని నిర్మిస్తున్నారు. ప్రభాస్తోపాటు రానా, అనుష్క, తమన్నా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.