రాజ్యసభ రేసు మొదలైంది
ఆంధ్రప్రదేశ్లో 4 స్థానాలు, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆశావహులు ఆయా పార్టీల అధినేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమ్మగ్నమయ్యారు. వారి వారి సేవలను గుర్తు చేస్తూ ఈసారి రాజ్యసభ సీటు తమకే ఇవ్వలంటూ ప్రాధేయ పడుతున్నారు. కాగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. తెలంగాణలో రెండు సీట్లు అధికార పార్టీకే దక్కే అవకాశాలు కనిపి స్తున్నాయి. ఆంద్రప్రదేశ్లో 4 సీట్లకుగాను మూడు తెలుగుదేశం పార్టీకి దక్క డం ఖాయం. అయితే నాలుగో సీటుకు కూడా ఆ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రతిపక్ష వైసీపీ తమ తరపున అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ఎప్పుడో ఖరారయ్యాడు. ఆయన ఈ రోజు నామినేషన్ కూడా వేయబోతున్నట్లు సమాచారం.
కాగా తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల నోటిఫి కేషన్ విడుదలయ్యింది. దేశ వ్యాప్తంగా జూన్ నెలలో 57మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఇందులో తెలంగాణలో 2,ఆంద్రప్రదేశ్ లో 4 స్థానాల భర్తీకి ఎన్నిక జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ మే 31 వరకు దాఖలు చేయవచ్చు. జూన్ 1 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 3న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. 11న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు సాయంత్రం 5గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. 13న ప్రక్రియ ముగియనుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.