మంత్రాలయంలో జక్కన్నను చూసేందుకు కోసం ఎగబడ్డ జనం..
టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు భార్య రమా కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఆలయానికి వెళ్ళారు. వీరితో పాటుగా ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి కుటుంబం మంచాలమ్మకు మొక్కులు చెల్లించుకుంది.
ఇక రాజమౌళి మంత్రాలయం వచ్చిన విషయం స్థానికులకు తెలిసిపోయింది. దీంతో వారు జక్కన్నను చూసేందుకు భారీగా తరలివచ్చారు. రాజమౌళి ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. దర్శనం తర్వాత ఆయన తనను చూసేందుకు వచ్చిన వారిని పలకరించారు. వారితో కాసేపు మాట్లాడి సంతోషపెట్టారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.