అమీ జాక్సన్ కి జూనియర్ ఐశ్వర్య బిరుదు ఇచ్చిన రజనీ..!
శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘ఐ’.ఈ సినిమాలో విక్రమ్ సరసన నటించిన బ్రిటన్ బ్యూటీ అమీజాక్సన్కు ఆ తర్వాత వరుస అవకాశాలు వస్తున్న విషయం తెలిసిందే. అమీ ఇటు కోలీవుడ్లో అటు బాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘రోబో 2.0’లో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటిస్తోంది. ఇందులో తన పాత్ర గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాల్ని బయటపెట్టింది ఈ బ్యూటీ. లేడీ రోబోగా నటిస్తోందని వస్తున్న వార్తల్ని ఖండించింది. తన కెరీర్లో ఇప్పటివరకు పోషించని విభన్నమైన పాత్ర చేస్తున్నానని తెలిపింది. అంతే కాదు రజనీకాంత్ తనకి జూనియర్ ఐశ్వర్య అనే బిరుదు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతోంది.
ఇదిలాఉంటే… సాధారణంగా తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడం శంకర్కి పెద్దగా ఇష్టం ఉండదు. అయితే మనీషా కొయిరాల, ఐశ్యర్య రాయ్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ‘భారతీయుడు’లో మనీషాకి ఛాన్స్ ఇచ్చిన శంకర్ ఆ తర్వాత తెరకెక్కించిన ‘ఒకేఒక్కడు’లో కూడా హీరోయిన్గా తీసుకున్నాడు. అలాగే ‘జీన్స్’, ‘రోబో’ సినిమాల్లో ఐశ్వర్య కనిపించింది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మల తర్వాత శంకర్ సినిమాల్లో హీరోయిన్ గా రిపీట్ కావడమనే ఘనత ప్రస్తుతం అమీ జాక్సన్ కే దక్కింది. దీనికి తోడు ఇప్పుడు రజనీకాంత్ కూడా మెచ్చుకోవడంతో ఈ ముద్దుగుమ్మ తెగ సంబరపడిపోతోంది. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న రోబో సీక్వెల్ 2017లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.