
తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చివరి రోజున రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ ఈ మహా సభలకు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన ఆయన హైదరాబాద్ బిర్యాని, బ్యాడ్మింటన్, బాహుబలి అని చెప్పుకొచ్చారు. ఈ వేడుకలకు 42 దేశాల నుండి హాజరైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియచేశారు.
దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్యం మీద తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కు మంచి పట్టు ఉందని రాం నాథ్ కోవింద్ కితాబిచ్చారు. రాష్ట్రపతి కూడా బాహుబలి సినిమా గురించి మాట్లాడటం సభలో పాల్గొన్న రాజమౌళికి గర్వంగా అనిపించింది. తెలుగు సినిమాగా బాహుబలి నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.