దసరాలో అంతటా రావణ దహనాలు.. కాని అక్కడ మాత్రం నిత్యపూజలు..
రామాయణంలో రావణాసురుడి పాత్ర గురించి అందరికి తెలిసిందే. సీతా అమ్మవారిని అపహరించడం తర్వాత రావణ వధ గురించి కూడా పురాణాల్లో ప్రస్తావన ఉంది.. రావణ వధ జరిగిన సందర్భంగా దసరా ఉత్సవాలు జరుపుకోవడం ప్రారంభమైందని ఓ ప్రచారం కూడా ఉంది. ఇదిలాఉంటే భారత్ లో రావణాసురుడిని అందరూ రాక్షసుడిగా భావిస్తే ఓ గ్రామ ప్రజలు మాత్రం నిత్య పూజలు చేస్తారు.
ఉత్తరప్రదేశ్లోని బందాయూలో లంకేశ్వరుడైన రావణాసురునికి నిత్య పూజలు జరుగుతుంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దసరా సంబరాలు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ మాత్రం మౌనం నెలకొంది. దసరా రోజున ఈ ఆలయ గేటును కూడా కనీసం తీయరు. ఈ ఆలయం ఏకంగా వంద సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయంలో రావణాసురుణ్ణి మహా వీరునిగా కీర్తించడంతోపాటు నిత్యం పూజలు కూడా చేస్తారు. ఈ ఆలయంలో రావణాసురుని విగ్రహంతో పాటు శివలింగం, ఇతర దేవీ దేవతల విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.