ఆర్ బీ ఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష.. కీలక వడ్డీరేట్లు తగ్గించిన గవర్నర్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశం వివరాలను ఆర్బీఐ గవర్నర్ రఘురామ్రాజన్ వెల్లడించారు. కీలక వడ్డీరేట్లను తగ్గించినట్లు చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి యథాతథంగా ఉంటుందన్నారు. రివర్స్ రెపో రేటును పావుశాతం మేర పెంచినట్లు తెలిపారు. రెపోరేటును ఆర్బీఐ 6.75 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గించింది. ఎంఎస్ఎఫ్ రేటును ఆర్బీఐ 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 2016-17లో వృద్ధిరేటు 7.6శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. సీఆర్ఆర్ రోజువారీ కనీస నిర్వహణను 95శాతం నుంచి 90శాతానికి తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.