జకీర్ నాయక్ కు రెడ్ కార్నర్ నోటీసు..?
వివాదస్పద మత ప్రచారకుడు జాకీర్ నాయక్పై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ కోరింది. ఇంటర్పోల్తో పాటు సీబీఐకి గురువారం ఎన్ఐఏ ఈమేరకు లేఖ రాసింది.ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. జకీర్ నాయక్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద మత బోధనలతో యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనికోసం విదేశాల నుంచి ట్రస్ట్కు వచ్చే నిధులు ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. బంగ్లాదేశ్ ఉగ్ర దాడి సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇర ఆరోపణలు వచ్చిన నాటి నుంచి జకీర్ నాయక్ విదేశాల్లోనే ఉంటున్నారు. దీంతో ఆయన్ను భారత్ రప్పించే ప్రయత్నంలో భాగంగా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఇంటర్పోల్ను ఎన్ఐఏ కోరినట్లుగా సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.