ఏపీ కోసం తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయండి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఎంత అప్పులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిత్యం అభివృద్ధి జపం చేస్తూంటారని అన్నారు. ఆయన చెబుతున్న అభివృద్ధి కోసం నిధులు ఎలా తెస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే విపక్ష నేత జగన్ కు కూడా హితవు పలికారు. చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు సబబు కాదని అన్నారు. ఇప్పటికైనా జగన్ హుందాగా వ్యవహరించాలని అన్నారు. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని సూచించారు. అలా చేయకపోతే దానిపై నిత్యం చర్చలు జరుగుతూనే ఉంటాయని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.