వీర సైనికుడు హనుమంతప్ప కన్నుమూత
ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీర సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప కన్నుమూశారు. సియాచిన్లోని మంచు చరియల్లో చిక్కుకుపోయిన అతను 6 రోజుల తర్వాత బయటపడిన విషయం తెలిసిందే. ఆ సమయం నుంచి హనుమంతప్పను ఆర్ఆర్ ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందించారు. కోమాలో ఉన్న హనుమంతప్ప ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణిస్తూ వచ్చింది. మూత్రపిండాలు, కాలేయం పని చేయడం మానేశాయి. దీంతో వైద్యులు ఆయనకు కృత్రిమ శ్వాస అందించారు. డయాలసిస్ నిర్వహించారు. మరోవైపు ఊపిరితిత్తుల్లో న్యుమోనియా ఉన్నట్లు కూడా వైద్యులు తేల్చారు. హనుమంతప్ప ప్రాణాలు కాపాడేందుకు సైనిక వైద్యులతో పాటు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం కూడా అన్ని రకాలుగా ప్రయత్నించింది. హనుమంతప్ప క్షేమం కోరుతూ దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్ధనలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గురువారం ఆయన పరిస్థితి పూర్తిగా విషమించడంతో హనుమంతప్ప కన్నుమూశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.