సస్పెన్షన్ పై హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి, సండ్ర..
టీడీపీ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలపై సస్పెన్షన్ పడిన విషయం తెలిసిందే. వారు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారని అసెంబ్లీ జరిగే అన్ని రోజులు సభకు హాజరుకాకుండా సస్పెన్షన్ విధించారు. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో వినూత్న తరహాలో నిరసన తెలిపిన విషయం కూడా తెలిసిందే. ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ఎండలో నిలబడి వినూత్న తరహాలో నిరసన తెలిపారు.
ఇక తమ సస్పెన్షన్ పై ఇరువురూ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమను సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన వాదిస్తున్నారు. తమను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ కు లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని వారు హైకోర్టుకు విన్నవించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.