భీమ్ యాప్ ద్వారా రూ. 1500 కోట్ల లావాదేవీలు: రవిశంకర్ ప్రసాద్
స్మార్ట్ఫోన్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. దీనికోసం భీమ్ యాప్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ భీమ్ – భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అప్లికేషన్ను 2 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా 50 లక్షల లావాదేవీలతో రూ. 1500 కోట్లు బట్వాడా అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.
జీరో అవర్ సమయంలో సమాజ్వాదీ పార్టీ నాయకురాలు జయా బచ్చన్ దీనికి సంబంధించిన ప్రశ్న అడిగారు. దీంతో ఆయన మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు. డిజిటల్ లావాదేవీలకు బాటలు వేసే క్రమంలో ప్రభుత్వం దేశ ప్రజల్ని అయోమయానికి గురిచేస్తోందని జయాబచ్చన్ అన్నారు. దీనిపై సమాధానం ఏంటని ఆమె ప్రశ్నించారు. యాప్ లావాదేవీలు పక్కన పెడితే గ్రామీణ ప్రాంతాల్లో అవసరానికి తగిన డిజిటల్ లావాదేవీలు అందించే కేంద్రాలు లేవని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.