సిరియాపై రష్యా వైమానిక దాడులు..
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సిరియాలోని రఖా నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రష్యా ఆ సిటీపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 30 మంది మరణించారు. ఈ విషయాన్ని ఓ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. మరణించిన వారిలో ఉగ్రవాదులతో పాటు సామాన్య పౌరులు కూడా ఉన్నారని తెలిపింది.
రఖ్ఖా నగరంపై పది రౌండ్ల దాడులు జరిగాయని సదరు సంస్థ ప్రకటించింది. ఇందులో 70 మందికి గాయాలు అయ్యాయని తెలుస్తోంది. అయితే మృతి చెందిన వారిలో ఉగ్రవాదులు ఎంతమంది.. సామాన్య పౌరులు ఎంతమంది అన్నది క్లారిటీ లేదు. రష్యా కూడా తమకు చెందిన ఆరు యుద్ధ విమానాలు రఖా నగరంపై దాడి చేశాయని ధృవీకరించింది. దాడుల సందర్భంగా రసాయన ఆయుధాల ఫ్యాక్టరీని ధ్వంసం చేశామని తెలిపింది. ఆయుధాలు నిల్వ ఉంచిన గొడౌన్ ను కూడా నాశనం చేసినట్లు రష్యా ప్రతినిధులు తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.