రాజ్ నాథ్ దూకుడుకు కారణాలేంటి..?
“ఒక దేశానికి ఉగ్రవాది అయిన వ్యక్తి మరో దేశానికి దేశభక్తుడు కాలేడు”..పాకిస్థాన్ లో పర్యటన సందర్భంగా భారత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగం సందర్భంగా ఇచ్చిన సందేశం. సార్క్ సమావేశాల కోసం పాక్ వెళ్ళిన రాజ్ నాథ్ దూకుడుగా వ్యవహరించారు.దీంతో ఆయనను భారత్ లో విపక్షాలు కూడా కీర్తించాయి.
రాజ్ నాథ్ సింగ్ అంత దూకుడుగా వ్యవహరించడానికి ఓ కారణం ఉంది. గతంలో పాక్ చెందిన వారు.. రాజ్ నాథ్ ను పాక్ గడ్డపై అడుగుపెట్టనీయబోమని వ్యాఖ్యలు చేశారు. ఇది ఆయనకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తర్వాత.. కశ్మీర్ లో బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తర్వాత తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఆ సమయంలో కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణ చేపట్టాల్సిందిగా పాకిస్థాన్ పార్లమెంట్ తీర్మానం చేసింది. ఈ విషయం భారత సర్కారుకు నచ్చలేదు. హోంమంత్రిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ రెండు విషయాలలో పాక్.. రాజ్ నాథ్ సింగ్ ను రెచ్చగొట్టినట్లు అయింది. దీంతో సార్క్ సమావేశాల సందర్భంగా పాక్ వెళ్ళిన రాజ్ నాథ్ దూకుడుగా వ్యవహరించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.