పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ అబ్బాసీ
పనామా పేపర్స్ ఆరోపణల నేపథ్యంలో నవాజ్ షరీఫ్ కి పాక్ సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే వైదొలగిన నేపథ్యంలో అక్కడ కొత్త ప్రధానికి ఎన్నుకోవాల్సి ఉంది. అయితే అప్పటివరకు తాత్కాలిక ప్రధానిగా షాహీద్ ఖాకన్ అబ్బాసీని నియమించారు. ఆయన షరీఫ్ సర్కారులో పెట్రోలియం , సహజవాయువుల శాఖ మంత్రిగా పనిచేశారు.
వాస్తవానికి ఖ్వాజా మహముద్ ఆసిఫ్ ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమిస్తారని వార్తలు వచ్చాయి. అలాగే పంజాబ్ ప్రావిన్స్ సీఎం షబాజ్ షరీఫ్ ను ప్రధానిగా నియమిస్తారంటూ కూడా వార్తలు వచ్చాయి. చివరకు పార్టీ సమావేశంలో షాహిద్ అబ్బాసీని ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీంతో షాహీద్ 45 రోజుల పాటు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించనున్నారు. ఈలోగా షబాజ్ షరీఫ్ ఎంపీగా ఎన్నికైతే ఆయనను ప్రధానిగా నియమించనున్నట్లుగా సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.