‘శతమానం భవతి’ ప్రారంభం..
ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా దిల్ రాజు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ లకు మంచి గుర్తింపు ఉంది. ఈ బ్యానర్ నుంచి చాలా సక్సెస్ సినిమాలు వచ్చినప్పటికీ, బొమ్మరిల్లు చిత్రానికి ఉన్న ప్రత్యేకతే వేరు.
” బొమ్మరిల్లు విడుదల అయి సరిగ్గా పదేళ్ళు అవుతోంది. తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధాన్ని సరికొత్తగా చూపించిన సినిమా బొమ్మరిల్లు. ఇప్పుడు సరిగ్గా అదే రోజున, తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ‘శతమానం భవతి’ సినిమాకి శ్రీకారం చుడుతున్నాం. మా బ్యానర్ కి బొమ్మరిల్లు సినిమా ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో, ఈ ‘శతమానం భవతి’ చిత్రం కూడా ఆ రేంజ్ లో పేరు తెస్తుందని నమ్మకం ఉంది.శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ డైరెక్షన్ లో ఈ మూవీని నిర్మిస్తున్నాం. వచ్చే సంక్రాంతి కి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం “, అని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లు గా కనిపించనున్న ఈ మూవీని సంక్రాంతి 2017 కి విడుదల చేస్తాం అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ , జయసుధ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మూవీ ఎడిటింగ్ మధు , సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి, మ్యూజిక్ మిక్కీ జె మేయర్. ఇతర పాత్రల్లో నటించేవారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మూవీ యూనిట్ తెలిపింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.