వైసీపీకి మళ్లీ షాక్.. టీడీపీలో చేరిన బద్వేలు ఎమ్మెల్యే..
వైసీపీకి మళ్ళీ షాక్ తగిలింది. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు సైలెంట్ గా సైకిలెక్కేశారు. విజయవాడలో బుధవారం ఉదయం ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అనంతరం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జయరాములుకు చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు బొండా ఉమా, యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, జూపూడి ప్రభాకర్ రావు పాల్గొన్నారు. జయరాములు బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల చివరి కల్లా వైసీపీకి చెందిన 21 ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకోవాలనే యోచనతో తెలుగు తమ్ముళ్లు ఉన్నట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.