టీడీపీకి షాక్ ఇవ్వనున్న శిల్పా మోహన్ రెడ్డి..?
శిల్పా మోహన్ రెడ్డి టీడీపీకి షాక్ ఇవ్వనున్నారని రాజకీయ వర్గాల్లో ముమ్మర ప్రచారం సాగుతోంది. ఆయన పార్టీని వీడే యోచనలో ఉన్నారని పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని సమాచారం. ఈ నెలలోనే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.దీనిపై ఆయన తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
శిల్పా మోహన్ రెడ్డి తన సన్నిహితులతో, అనుచరులతో భేటీ అయి ముమ్మరంగా చర్చలు చేస్తున్నారని ముమ్మర ప్రచారం సాగుతోంది.దీనికి కారణం నంద్యాల ఉప ఎన్నికలో టిక్కెట్ దక్కకపోవడమేనని తెలుస్తోంది. టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపం చెందారని సమాచారం. అందువల్లే ఆయన పార్టీని వీడనున్నారని తెలుస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.