యూపీఏ చైర్మ పర్సన్ ఎవరో తేల్చి చెప్పేసిన వీరప్ప మొయిలి..
ఇటీవలె కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టారు. అయితే యూపీఏ చైర్ పర్స్ గా ఎవరు ఉంటారనే దానిపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత వీరప్పమొయిలి స్పష్టత ఇచ్చారు. విపక్షాలను ఏకం చేయగలితే సత్తా సోనియా గాంధీకి ఉందని అన్నారు. ఆమె మాత్రమే యూపీఏ చైర్ పర్సన్ గా కొనసాగుతారని అన్నారు.ఆమె గత 19 ఏళ్లుగా యూపీఏ చైర్ పర్సన్గా కొనసాగుతున్నారు.
‘‘యూపీఏ చైర్ పర్సన్గా సోనియా గాంధీనే కొనసాగుతారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలను ఒక్క చోటుకి చేర్చే సత్తా ఆమెకు మాత్రమే ఉంది’’ అంటూ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను ఏకం చేయడం నేషనలిస్ట్ పార్టీ అధినేత శరద్ పవార్ వల్ల కాదని తేల్చేశారు. యూపీఏ ఇంకా బలంగానే ఉందన్నారు. శరద్ పవార్ కూడా యూపీఏలో భాగస్వామి అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.