cత్వరలో డీఎంకే అధికారంలోకి వస్తుంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుబ్రమణియన్ స్వామి..
బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితులపై ఆయన తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వస్తుందని అన్నారు. అదీ అతి త్వరలోనే వస్తుందని స్పష్టం చేశారు. దినకరన్ వర్గం నేతలు డీఎంకేతో మంతనాలు జరుపుతున్నారని ట్వీట్ లో పేర్కొన్నారు.
దినకరన్కు23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అన్నారు. వీరు డీఎంకేతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేస్తారని చెప్పారు. వీరికి ఓ ఇండిపిండెంట్ ఎమ్మెల్యే మద్దతు తెలిపే అవకాశం ఉందని రాజకీయ వర్గాల సమాచారం. ఇప్పటికే దినకరన్ తమిళనాడు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలతో మద్దతు ఉపసంహరింప చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.