దక్షిణ కొరియా అధ్యక్షురాలిపై వేటు..!
ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షురాలిపైనే ఆ దేశపు కోర్టు చర్యలు తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షురాలు పార్క్ గుయెన్ ను పదవి నుంచి తప్పించాలంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాజ్యాంగ ధర్మాసనం సమర్ధించింది. దీంతో ఆమెపై చర్యలు మొదలుకానున్నాయి. దక్షిణకొరియాలో ప్రజాస్వాయ్య ప్రభుత్వాలు 37 ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. అయితే గతంలో ఇలా అధ్యక్షురాలిపై వేటు పడటం జరగలేదు. పదవీకాలం ముగియకుండా పదవి నుంచి దిగిపోతున్న మొదటి నేతగా పార్క్ గుయెన్ నిలువనున్నారు.
1980లో దక్షిణ కొరియాలో ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన ఆరంభమైంది. ఇక అక్కడి నుంచి ఇప్పటివరకు ఏ నేత కూడా ఇలా మధ్యలోనే పదవి నుంచి దిగిపోలేదు.పార్క్ గుయెన్ పై వేటుపడటంతో మరో రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. మరో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.గతంలో అంటే 2012లో పార్క్ గుయెన్ చేతిలో లిబరల్ మూన్ జే ఇన్ పరాజయం పాలయ్యారు. ఆయననే ప్రస్తుతం రేసులో ముందంజలో ఉన్నారు. దక్షిణ కొరియాలో రాజకీయ అనిశ్చితి కారణంగా నానా ఇబ్బందులు ఉన్నాయి. తాజాగా తీర్పుతో ఆమె మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.