టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్ మధుసూదనాచారి
తెలంగాణ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే దీనికి టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంటక వీరయ్యలు అడ్డుపడ్డారు. దీనిపై తక్షణం స్పీకర్ చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇద్దరిని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీన్ని ఆమోదించినట్లుగా స్పీకర్ తెలిపారు.
బీఏసీ సమావేశంలో కోరినా.. చివరకు గవర్నర్ ప్రసంగం సందర్భంగా హరీశ్ రావు కోరినా కూడా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. దీంతో టీడీపీ తీరుపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నిరసనలు తెలపడం స్పీకర్ చైర్ ను వ్యతిరేకించడమేనని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసినా కూడా టీడీపీ నేతలు తమ నిరసనలు కొనసాగించారని అన్నారు. వీటి ఆధారంగా సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.