స్వామీ.. ఈ వ్యాఖ్యల మరమ్మమేమీ?
భారతీయ జనతాపార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు కేంద్రంలో పెను దుమారమే రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు అటు ప్రభుత్వాన్ని..ఇటు భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత ఆర్ బీఐ గవర్నర్ రఘురామరాజన్ తో మొదలైన స్వామి ఎటాక్ రోజుకొకరి చొప్పున విస్తరిస్తూ పోతోంది. తాజాగా కేంద్ర మంత్రులపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. భారత్ కు చెందిన మంత్రులు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు సంప్రదాయ, లేదా మన దేశానికే చెందిన ఆధునిక దుస్తులు ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారు టై, కోట్ ధరిస్తే వెయిటర్లలా కనిపిస్తారంటూ స్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వీటిపై భారతీయ జనతా పార్టీ ఇరాకాట పరిస్థితిని ఎదుర్కొంది.
స్వామి వ్యాఖ్యలపై అటు బీజేపీ అధిష్టానంతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా సుబ్రహ్మణ్య స్వామి ఎందుకులా అంటున్నారంటూ మరికొంతమంది ఆరా తీస్తున్నారు. స్వామి మాటల వెనుక ఏమైనా మర్మముందా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అయితే తమపార్టీ ఎంపీ అయిఉండి తమపైనే సెటైర్లు వేయడం ఏంటని బీజేపీ నేతలు కొంతమంది స్వామిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.