మెకల్లమ్ రికార్డును ఇండియన్ క్రికెటర్లే అధికమించాలి: సురేశ్ రైనా
టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన బ్రెండన్ మెకల్లమ్ రికార్డును ఇండియన్ క్రికెటర్లే అధిగమించాలని కోరుకుంటున్నట్లు టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా చెప్పారు. మెకల్లమ్ వరల్డ్ రికార్డు సాధించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. అయితే దీన్ని భారత క్రికెటర్లే అధిగమించాలని ఆశిస్తున్నానని తెలిపారు. గుజరాత్ లయన్స్ జట్టులో మెకల్లమ్ ఉండడం సంతోషకరమైన విషయమని చెప్పారు. అతను భయమెరుగని క్రికెటర్ అని అన్నారు. అలాంటి మంచి క్రికెటర్ నే తాము కోరుకుంటున్నామని చెప్పారు. శనివారం జరిగిన ఐపీఎల్ కొత్త జట్టు గుజరాత్ లయన్స్ జెర్సీ ఆవిష్కరణ సభలో రైనా పాల్గొన్నారు. గుజరాత్ కెప్టెన్సీ అన్నది కేవలం తనకు పదవి మాత్రమేనని తెలిపారు. తనకు జట్టును గెలిపించే ప్రదర్శనలే ముఖ్యమమన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.