కేసీఆర్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది: మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతల గురించి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అసలు కాంగ్రెస్ నేతలు ఎందుకు టన్షన్ పడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. తమ ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్ల కాలంలో అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తాము చేస్తున్న పనులను కాంగ్రెస్ నేతలు గతంలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
గత 60 ఏళ్ళలో చేయలేనిది తాము కేవలం రెండున్నర ఏళ్ళో చేసి చూపించామన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నేతల రాజ్యాలు నడవడం లేదని ఆందోళన పడుతున్నారని ఆరోపించారు. మొత్తం బీసీలు 50 శాతం మేర ఉన్నారని అన్నారు. వారికోసం మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అదే కాంగ్రెస్ హయాంలో బీసీలకు ఏమీ చేయలేదన్నారు. కాంగ్రెస్ లాంటి దిక్కుమాలిన నేతలకు కేసీఆర్ లాంటి మంచి ఆలోచనలు వచ్చాయా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలిచిన వారిని సన్నాసులు దద్దమ్మలు అనక ఏమంటారని అన్నారు. తమ పద్ధతిలోనే పరిపాలన చేస్తామన్నారు. తమకు ప్రజలే రిమోట్ కంట్రోల్ అని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.