తీరని అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయింది: తమ్మినేని వీరభద్రం
తెలంగాణ రాష్ట్రం తీరని అప్పుల్లో కూరుకుపోయిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేన వీరభద్రం ఆరోపించారు. ఈ విషయాన్ని కాగ్ వివరించిందని అన్నారు. కాగ్ నివేదికతో ఈ విషయం స్పష్టమైందని అన్నారు. బడ్జెట్ లో మిగులు నిధులు ఉన్నాయని సీఎం చెప్పారని అన్నారు. సీఎం చెప్పేది అంతా అబద్దమేనని అన్నారు.
కాగ్ నివేదికను బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని రుజువైందని అన్నారు. రుణాలు లభించకపోతే లోటు బడ్జెట్ అవుతుందని అన్నారు. అంతేతప్ప మిగులు బడ్జెట్ కాదన్నారు.ఈ విషయం కాగ్ నివేదిక చెబుతోందని అన్నారు.అయితే కాగ్ నివేదికను అంగీకరించేందుకు సర్కారు సిద్ధంగా లేదన్నారు. కాగ్ నివేదికపై సమాధానం చెప్పి తీరాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.