సీఎం కేసీఆర్ అడిగి చప్పట్లు కొట్టించుకుంటున్నారు: రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకునే స్థితికి చేరారని విమర్శించారు. కేసీఆర్ను ఆయన సొంత గ్రామస్తులే విమర్శిస్తున్నారని అన్నారు. తెలంగాణలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కాని ఈ విషయంలో రైతులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతాంగాన్ని మభ్యపెట్టేందుకే ఉచిత ఎరువుల పథకం ప్రవేశపెడుతున్నారని అన్నారు. రైతు రుణమాఫీని వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు ఎలా రక్షణ కల్పించబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 28న తాండూరులో ప్రజాపోరు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.