రోజాను చూస్తే చంద్రబాబుకు భయం: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే రోజాను చూస్తే చంద్రబాబుకు వణుకు పుడుతోందని విమర్శించారు. అసలు ఆమెను చూస్తే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేవలం భయం కారణంగానే రోజాపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అందుకే రోజాను శాసనసభకు రానీయకుండా మళ్లీ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే జేపీ ప్రభాకర్ రెడ్డిపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. జేపీ ఒళ్ళు బలిసి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేపీ నోరు అదుపులో పెట్టుకోకపోతే సహించేది లేదని స్పష్టం చేశారు. జేపీ సోదరులు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. వారి పద్ధతి ఇలాగే ఉంటే జనం తరిమి తరిమి కొడతారని ధ్వజమెత్తారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.