డోన్ సింగిల్ విండో చైర్మన్ పదవి టీడీపీ కైవసం
కర్నూలు జిల్లా డోన్ సింగిల్ విండో చైర్మన్ పదవికి గురువారం ఉప ఎన్నిక జరిగింది. ఇందులో టీడీపీ అభ్యర్థి వాణిశ్రీ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి తిమ్మారెడ్డిపై 9 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. కర్నూలు జిల్లా కొండపేటలోని సహకార సంఘం కార్యాలయంలో ఉపఎన్నిక చేపట్టారు. అయితే గతంలో సింగిల్ విండో చైర్మన్గా ఉన్న గోపాల్ రెడ్డికి జీవితఖైదు పడింది.
దీంతో ఆయన పదవి కోల్పోయారు.ఈ కారణంగా తాత్కాలిక చైర్మన్గా వాణిశ్రీని ఎన్నుకున్నారు. సింగిల్ విండో చైర్మన్ పదవికి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు ఇవాళ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఉప ఎన్నికలో వాణిశ్రీ విజయం సాధించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.