గత వారం రోజులుగా చూస్తున్న పరిణామాలు చూస్తుటే తెలుగుదేశం పార్టీలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తున్నట్లు ఉంది. వారి ఆందోళనకు కారణంగా వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూరే కారణమని రాజకీయ విశ్లేషకుల వాదనం. రాష్ట్రంలో అవినీతి జరిగిందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి ఒక్కో ఎమ్మెల్యేకి రూ.20 నుంచి రూ.40 కోట్లు పెట్టున్నారని, అలాగే మంత్రి పదువులు కూడా ఇస్తామని ఆశ చూపుతున్నారంటూ చంద్రబాబుపై `చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్` అనే పుస్తకాన్ని వేసి ఢిల్లీ పెద్దలకు పంచుతుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సభ్యులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఢిల్లీ గల్లీలో రాష్ట్రం పరువు తీస్తారని ఒకరంటే, ఆయన ఢిల్లీలో విహార యాత్ర చేస్తున్నారని మరొకరు అంటున్నారు. ఆర్థిక మంత్రి యనమల రాజకృష్ణుడు దగ్గరిని నుంచి టీడీపీ నేత బాబు రాజేంద్ర ప్రసాద్ వరకు అందరూ కూడా వైయస్ జగన్కు బీజేపీ పెద్దలు ఎలా అపాయింట్ మెంట్ ఇస్తారంటూ వాదిస్తున్నారు.
జగన్లాంటి వారిని ప్రోత్సహిస్తే ప్రజల్లో అపోహాలు పెరిగే ప్రమాద ఉందని ఆయన యనమల హెచ్చరించారు. గతంలో కేంద్ర పెద్దలను కలిసేందుకు జగన్ ప్రయత్నిస్తే తిరస్కరించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్కు అవకాశం ఇవ్వడం సమంజసంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రతిపక్ష సభ్యులకు అధికార పార్టీ సభ్యులు అపాయింట్ ఇవ్వకూడదని ఏమైనా ఎక్కడైనా రాసి ఉందా? ప్రతిపక్ష సభ్యులు అపాయింట్ మెంట్ ఇస్తే తప్పేంటి? అని కొంతమంది విశ్లేషలు ప్రశ్నిస్తున్నారు. జగన్ ఢిల్లీ టూర్ మాత్రం టీడీపీలో ప్రకంపనలు పుట్టించిందని.. టీడీపీ సభ్యులంతా మూకుమ్మడి దాడి చేయడాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీ కొంచెం భయపడుతున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.