టీడీపీ కార్యకర్తల పార్టీ: రేవంత్ రెడ్డి
ఉగాది పర్వదినం, టీడీపీ ఆవిర్భావం రెండు ఒకే రోజు కావడం చాలా సంతోషకరమైన విషయమని తెలంగాణ టీడపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి స్పందించారు. దివంగత నేత ఎన్టీఆర్ స్పూర్తితో తెలుగు దేశం పార్టీ నడుస్తుందని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధి చెందుతుందని అన్నారు.
టీడీపీ కార్యకర్తల పార్టీ అని అన్నారు. తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. తెలంగాణలో టీడీపీని దెబ్బతీసేందుకు సీఎం కేసీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా తమ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే కేసీఆర్ ఏం చేసినా ఆయన ప్రయత్నాలు మాత్రం సాగవని అన్నారు. కొందరు నేతలు టీడపీని విడిచి వెళ్లినా పార్టీకి నష్టం లేదన్నారు. టీడీపీ కార్యకర్తల పార్టీ అని అన్నారు. కార్యకర్తలు మాత్రం ఎప్పటికీ టీడీపీకి అండగానే ఉంటారని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.